Ilayaraja: మైత్రీ మూవీ మేకర్స్కు ఇళయరాజా నోటీసులు 9 d ago

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ జతగా వచ్చిన లేటెస్ట్ చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రం విడుదలైన వెంటనే మంచి టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు ఓ వివాదం ఎదురైంది. సంగీత దర్శకుడు ఇళయరాజా, తన పాటలను అనుమతి లేకుండా వాడుకున్నారని పేర్కొంటూ, మైత్రీ మూవీ మేకర్స్కు లీగల్ నోటీసులు పంపారు. 5 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ఈ నోటీసులు జారీ చేశారు. ఈ అంశం సామజికమాధ్యమంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.